ఆ విషయంలో కేసీఆర్పై చర్యలేవీ..?: రఘనందనరావు
ABN, First Publish Date - 2022-01-03T20:10:29+05:30
ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు.
కరీంనగర్: సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటనలో మాస్క్ లేకుండా వేలమందిలో తిరిగితే చర్యలెందుకు తీసుకోరు? అని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్లో రఘనందనరావు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ సీపీకి వివాదాస్పదుడిగా పేరుందన్నారు. కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షించబడదని చెప్పారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మాస్క్ లేకుండా ప్రెస్మీట్ నిర్వహించారన్నారు. ఓల్డ్సిటీలో హైదరాబాద్ ఎంపీ వేల మందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. డీజీపీకి సోకు ఉంటే రాజకీయాల్లోకి రావొచ్చని ఎద్దేవా చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఉద్యోగాల సంఘాల నేతలు పదవుల కోసం పెదవులు మూయోద్దని దెప్పిపోడిశారు. కూకట్పల్లి కమిషనర్గా పనిచేసేందుకో... భర్తలకు ఉద్యోగ పొడిగింపు కోసమో... ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని సంఘాలకు రఘనందనరావు విజ్ఞప్తి చేశారు
Updated Date - 2022-01-03T20:10:29+05:30 IST