కేసీఆర్పై ఆ స్కిట్ విషయంలో బండి సంజయ్కి పోలీసుల నోటీసులు
ABN, First Publish Date - 2022-06-14T17:47:20+05:30
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో అనే సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ్మ, ఎల్లన్నని హయత్ నగర్ పోలీస్లు ఈ రోజు అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి హయత్ నగర్ పోలీస్లు నోటీసులు ఇచ్చారు.ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణను పోలీస్లు అరెస్ట్ చేశారు. అదే రోజు బెయిల్పై జిట్టా బాలకృష్ణ విడుదల అయ్యారు.
Updated Date - 2022-06-14T17:47:20+05:30 IST