Anantha Vishnudeva Prabhu లీలలపై పోలీసుల దృష్టి
ABN, First Publish Date - 2022-07-06T16:37:52+05:30
అనంత విష్ణుదేవ ప్రభు(Anantha Vishnudeva Prabhu) లీలలపై పోలీసులు దృష్టి సారించారు.
Hyderabad : అనంత విష్ణుదేవ ప్రభు(Anantha Vishnudeva Prabhu) లీలలపై పోలీసులు దృష్టి సారించారు. జై మహాభారత్ పార్టీ(Jai Mahabharath Party) అధినేతపై పోలీసులు కేసు పెట్టే యోచనలో ఉన్నారు. ఆధార్కార్డుల(Adhar Cards) సేకరణపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈసీ(EC)కి హైదరాబాద్ పోలీసులు సమాచారమిచ్చారు. ఆధార్కార్డు జిరాక్స్ తీసుకుని నిర్వాహకులు సభ్యత్వం ఇస్తున్నారు. అనుమతి లేకుండా 3 నెలల్లో 5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. జై మహాభారత్ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి... ప్రభుత్వ భూమిని ఇప్పించే యత్నం చేస్తామని విష్ణుదేవ్ తెలిపారు. అనంత విష్ణుదేవపై సైఫాబాద్ పీఎస్లో స్థానికులు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-07-06T16:37:52+05:30 IST