ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు?: వైఎస్‌ షర్మిల

ABN, First Publish Date - 2022-07-25T22:43:29+05:30

పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. పోలవరం (Polavaram) వల్ల ఇబ్బంది అవుతుందని సీఎం కేసీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. పోలవరం (Polavaram) వల్ల ఇబ్బంది అవుతుందని సీఎం కేసీఆర్ (CM KCR) ఎందుకు అనలేదు? అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) కట్టిన తర్వాతే వరద ఎక్కువ వచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం లోపాల బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. కలర్ ఫోటోలకు, టూరిజం స్పాట్‌గా మాత్రమే కాళేశ్వరం పనికొచ్చిందని షర్మిల ఎద్దేవాచేశారు. కడెం ప్రాజెక్ట్ (Kadem project) గేట్లు మార్చాలన్న డిమాండ్లను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందని తెలిపారు. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలన్నారు. వరదల్లో గూడు కోల్పోయినవారికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-25T22:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising