ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు రగడ: TRSలో మొదలైన తిరుగుబాట్లు

ABN, First Publish Date - 2022-06-28T18:27:37+05:30

అధికార టీఆర్‌ఎస్ పార్టీలో తిరుగుబాట్ల పర్వం మొదలైంది. పోడు రైతుల పట్టాల కోసం సర్పంచ్ మడకం స్వరూప తన పదవికి రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: అధికార టీఆర్‌ఎస్ (TRS) పార్టీలో తిరుగుబాట్ల పర్వం మొదలైంది. పోడు రైతుల పట్టాల కోసం సర్పంచ్ మడకం స్వరూప తన పదవికి రాజీనామా చేశారు. అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గ్రామ సర్పంచ్ మడకం స్వరూపతో పాటు 160 కుటుంబాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పోడు రైతుల పట్టాల కోసం సర్పంచ్ స్వరూప ఆధ్వర్యంలో ఛలో ప్రగతిభవన్ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. కాగా పోలీసులు పాదయాత్రను అడ్డుకుని మహిళలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోడు పట్టాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో సర్పంచ్ పదవితో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్వరూప  ప్రకటించారు. మరోవైపు పోడు పట్టాల కోసం రాజీనామా బాటలో పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోడు రగడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తోంది. 

Updated Date - 2022-06-28T18:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising