పెసలపాడు ఎన్కౌంటర్ బూటకం: మావోయిస్టు జగన్
ABN, First Publish Date - 2022-01-09T23:38:05+05:30
డిసెంబర్ 26న జరిగిన పెసలపాడు ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.
వరంగల్: డిసెంబర్ 26న జరిగిన పెసలపాడు ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. జగన్ పేరుతో మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. అమాయక ఆదివాసీలను కాల్చిచంపి ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారని జగన్ మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సిరిసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డికి మావోయిస్టులు లేఖ రాశారని సృష్టించారని, తప్పుడు లేఖ అడ్డుపెట్టుకుని పోలీస్ రక్షణ కోరాడని తెలిపారు. లక్ష్మారెడ్డి ద్వారా మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆదివాసీలను కోవర్టులుగా వాడుకుంటే కోర్స రమేష్కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ తప్పుడు ప్రచారం మానుకోవాలని జగన్ హెచ్చరించారు.
Updated Date - 2022-01-09T23:38:05+05:30 IST