రామకృష్ణ సెల్ఫీ వీడియో చూసి ప్రజలు చలించిపోయారు: భట్టి
ABN, First Publish Date - 2022-01-06T22:00:30+05:30
రామకృష్ణ సెల్ఫీ వీడియో చూసి రాష్ట్ర ప్రజలు చలించిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్: రామకృష్ణ సెల్ఫీ వీడియో చూసి రాష్ట్ర ప్రజలు చలించిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగూడెంలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని, వారంతా వనమా రాఘవ పేరు రాశారని చెప్పారు. పోలీస్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తప్పుబట్టారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు ప్రజలకు సేవచేయడం మరిచాయని, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
రామకృష్ణ కుటుంబానిది ఆత్మహత్య కాదని హత్యేనని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. వనమా రాఘవ ఎక్కడ ఉన్నాడు. ప్రగతిభవన్లోనా.. పువ్వాడ ఇంట్లో ఉన్నాడా: అని ప్రశ్నించారు. న్యాయపరంగా రాఘవను అరెస్ట్చేసి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్కు మానవత్వం ఉంటే 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-01-06T22:00:30+05:30 IST