Hyderabad: ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో దారుణం
ABN, First Publish Date - 2022-05-31T17:37:56+05:30
నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో దారుణం జరిగింది.
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో దారుణం జరిగింది. ఓ మృతుడి కుటుంబం పట్ల మార్చురీ సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహం మార్చురీలో పెడుతామంటూ ఇబ్బందికి గురిచేశారు. మద్యం మత్తులో మృతుడి బంధువులతో మార్చురీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మార్చురీ సిబ్బంది తీరుపట్ల మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాదర్ఘాట్లో ఆర్ధిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-05-31T17:37:56+05:30 IST