సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసుల నోటీసులు
ABN, First Publish Date - 2022-06-24T20:56:47+05:30
సికింద్రాబాద్ విధ్వంసం కేసు విషయంలో రైల్వే పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు
హైదరాబాద్: సికింద్రాబాద్ విధ్వంసం కేసు విషయంలో రైల్వే పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు.తాజాగా సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసుల నోటీసులు జారీ చేశారు.రైల్వే యాక్ట్ 1989 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన రికార్డులు,ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
Updated Date - 2022-06-24T20:56:47+05:30 IST