ఆగని అత్యాచారాలు
ABN, First Publish Date - 2022-06-11T08:22:54+05:30
తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న తెగింపా
మరో ముగ్గురు బాలికలపై యువకుల అఘాయిత్యాలు
తొమ్మిదేళ్ల బాలికను బెదిరించి ఆటోడ్రైవర్ అత్యాచారం
హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు బాలికలపైనా
హైదరాబాద్లో మరో ఇద్దరు బాలికపై అఘాయిత్యాలు
సరూర్నగర్, కొత్తపేట, సైదాబాద్, నారాయణఖేడ్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న తెగింపా? వ్యవస్థ అంటే భయం లేని తనమా? ఏమోగానీ బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు! ఇటీవల జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికినా దుర్మార్గుల్లో మార్పు రావడం లేదు. తొమ్మిదేళ్ల బాలికపై కన్నేసిన 30 ఏళ్ల ఆటో డ్రైవర్, ఆమెను తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి మూడురోజుల పాటు అత్యాచారం చేశాడు! మరో ఘటనలో ప్రేమ, పెళ్లి పేరుతో విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకొని.. ఆ ఘటననంతా వీడియో తీశాడు! ఈ రెండు ఘటనలూ హైదరాబాద్లోనే జరిగాయి! నగరంలోనే మరో ఘటనలో 13 ఏళ్ల బాలికకు ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు!! ఆయా స్టేషన్ల పరిఽధుల్లోని పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం వివరాలు ఇవీ. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్నగర్ ప్రాంతం లో షేక్ సలీమ్ (30) ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. పూటుగా మద్యం తాగి భార్యతో గొడవపడుతుండటంతో ఆ బాధలు భరించలేక పిల్లలను వెంటబెట్టుకొని ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.
గల్లీలోనే మరో ఇంట్లో తల్లి పనులకు వెళుతుండటంతో తొమ్మిదేళ్ల బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంటోం ది. ఆమెపై కన్నేసిన సలీమ్ బాలికను ఇంట్లోకి పిలిపించుకొని బెదిరింపులకు గురిచేసి వరుసగా మూడు రోజులు అత్యాచారం చేశాడు. స్థానికులకు అనుమానం రావడంతో గురువారం రాత్రి బాధితురాలి తల్లికి చెప్పారు. రాత్రి 10 గంటలకు చిన్నారిని అడిగి నిర్ధారించుకున్న తల్లి, శుక్రవారం స్థానికుల సాయంతో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాఽధిత బాలిక నుంచి మహిళా పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారని ‘ఆంఽధ్రజ్యోతి’కి ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో., అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, పీఓఏల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
మరో ఘటనలో..
తనతో పాటు ఇంటర్ చదువుతున్న బాలిక (15)ను ప్రేమ పేరుతో నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెపై అత్యాచారం చేశాడో యువకుడు (19). పైగా ఆ ఘటననంతా వీడియో తీసి.. పెళ్లి మాటెత్తినా, విషయం ఎవరికైనా చెప్పినా వీడియోను బయటపెడతానని ఆమెను బెదిరించాడు. భయపడ్డ బాలిక, ఆలస్యంగా విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీసుస్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు గురువారం ఫిర్యాదు చేసింది. సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. బడంగ్పేట్కు చెందిన ఓ బాలిక నగరంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే తరగతికి చెందిన నల్లకుంట నివాసి జి.అమిత్వర్ధన్(19) అనే విద్యార్థి ఆమెతో పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నాని చెప్పాడు. గత జనవరిలో అతడితో ప్రేమను బాలిక అంగీకరించి తన మొబైల్ నంబర్ ఇచ్చింది. ఆమెతో మరింత చనువు పెంచుకున్న అమిత్ ఫిబ్రవరిలో పని ఉందంటూ బాలిక ఇంటికొచ్చాడు.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి దానిని వీడియో తీశాడు. కాగా నిందితుడు అమిత్పై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్టు సీఐ మహేందర్రెడ్డి చెప్పారు. మరోవైపు.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై నమ్లిమెట్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక ఈ నెల 6న అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయ గా.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక ఉన్న చోటును గుర్తించారు. యువకుడు బాలికకు మాయమాట లు చెప్పి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పా ల్పడినట్లు గుర్తించారు. అతడిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
మభ్య పెట్టి పెళ్లి..
ఓ ఆటోడ్రైవర్, ఇన్స్టాగ్రాంలో ఓ బాలిక(13)ను పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. హయత్నగర్ గౌరెల్లికి చెందిన శ్రీకాంత్(23) ఆటోడ్రైవర్. సైదాబాద్లోని ఓ బస్తీకి చెందిన బాలిక(13)తో ఇన్స్టాగ్రాంలో పరిచయమైంది. దీనిని ఆసరాగా చేసుకున్న శ్రీకాంత్ మాయమాటలతో మభ్యపెట్టి ఆ బాలికను గురువారం సాయంత్రం ఆటోలో తీసుకెళ్లి నగర శివారు ప్రాంతంలో ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. తమ కూతురు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను రప్పించి శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Updated Date - 2022-06-11T08:22:54+05:30 IST