టీఆర్ఎస్తో పొత్తు ఉండదు: మహేశ్వర్ రెడ్డి
ABN, First Publish Date - 2022-04-29T01:44:28+05:30
వచ్చే ఎన్నికల్లోన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్తో
నిర్మల్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్తో పొత్తు ఉండదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. పుట్టెడు సమస్యలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే జాతీయ రాజకీయాలంటూ డ్రామాలు మొదలెట్టాడని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను, ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన తెలిపారు.
Updated Date - 2022-04-29T01:44:28+05:30 IST