TS news: నిజామాబాద్ కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-07-25T19:18:29+05:30
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కృష్ణ అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నాడని శ్రీనివాస్ ఆరోపించాడు. పది శాతం ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు. కలెక్టర్ (Collector) నారాయణ రెడ్డి (Narayana reddy) కారుకు అడ్డంగా నిలబడి నిరసనకు దిగడంతో... వెంటనే స్పందించిన కలెక్టర్ శ్రీనివాస్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే తగు చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్కు కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
Updated Date - 2022-07-25T19:18:29+05:30 IST