TS News: తల్లిదండ్రులు బర్త్డే వేడుకలకు రాలేదంటూ కుమారుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-07-26T17:42:31+05:30
తల్లిదండ్రులు బర్త్డే వేడుకలకు రాలేదంటూ ఓ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కామారెడ్డి: తల్లిదండ్రులు బర్త్డే వేడుకలకు రాలేదంటూ ఓ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుబ్బాక విజయ్(27) అనే యువకుడు తల్లిదండ్రులను తన బర్త్డే వేడుకలకు ఈనెల 23న రావాలని ఆహ్వానించాడు. విజయ్ తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణంలో పని చేసుకుంటూ నివాసముంటున్నారు. అయితే బర్త్డే వేడుకులకు తల్లిదండ్రులు రాకపోవడంతో మనస్థాపం చెందిన విజయ్ 23న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-07-26T17:42:31+05:30 IST