దరఖాస్తుల ఆహ్వానం
ABN, First Publish Date - 2022-08-09T04:47:15+05:30
నేషనల్ మైనార్టీస్ ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్, మెరిట్ కం.మీన్స్ స్కాలర్షిప్, రెన్యూవల్ కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్, పీహెచ్డీ, ఐటీఐ, ఐటీసీ, టెక్నికల్ కోర్సులు, పోస్టు గ్రాడ్యూయేషన్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రతన్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఒకపత్రికా ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్అర్బన్, ఆగస్టు 8: నేషనల్ మైనార్టీస్ ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్, మెరిట్ కం.మీన్స్ స్కాలర్షిప్, రెన్యూవల్ కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్, పీహెచ్డీ, ఐటీఐ, ఐటీసీ, టెక్నికల్ కోర్సులు, పోస్టు గ్రాడ్యూయేషన్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రతన్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఒకపత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం అక్టోబర్ 16లోగా, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం నవంబరు 15లోగా మెరిట్ కం.మీన్స్ స్కాలర్షిప్ కోసం నవంబరు 15లోగా, బేగుంహజ్రత్ మహాల్ స్కాలర్షిప్ కోసం అక్టోబర్ 16లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు స్కాలర్షిప్స్.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Updated Date - 2022-08-09T04:47:15+05:30 IST