ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గజాల స్థలం కోసం ఘర్షణ

ABN, First Publish Date - 2022-03-06T04:56:08+05:30

రెండు గజాల స్థలం కోసం రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భిక్కనూర్‌, మార్చి 5: రెండు గజాల స్థలం కోసం రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోళ్ల చిన్నమల్లయ్యకు ఉన్న రెండు గజాల భూమి పక్కనే ఉన్న భూమయ్య, బాలమల్లు, యాదిరెడ్డి భూములు ఉన్నాయి. భూముల సరిహద్దు విషయంలో మల్లయ్య ప్రశ్నించడంతో మాటమాట పెరిగి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిని ఆపేందుకు అక్కడే ఉన్న మహిళలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. దింతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు గజాల స్థలం కబ్జా చేయడమే కాక తమపై దాడి చేశారని మల్లయ్య, రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు భిక్కనూర్‌ ఎస్‌ఐహైమద్‌ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-03-06T04:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising