‘ప్రజా సంగ్రామ యాత్ర’ సభకు తరలిన బీజేపీ శ్రేణులు
ABN, First Publish Date - 2022-05-15T06:54:34+05:30
రాష్ట్రంలో అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనడానికి ఇందూరు నుంచి పెద్దఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణగుప్త తెలిపారు.
పెద్దబజార్, మే 14: రాష్ట్రంలో అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనడానికి ఇందూరు నుంచి పెద్దఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణగుప్త తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి 45 వాహనాలు భారీ ర్యాలీగా ప్రజా సంగ్రామ యాత్రకు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పేద ప్రజలను ముంచడానికి తప్ప పెద్దగా ఒరిగిందేమిలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, సుక్క మధు, మెట్టు విజయ్, పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్, రాజశేఖర్రెడ్డి, మీసేవా శ్రీనివాస్, కిషోర్, సుధీర్, ప్రభాకర్, జోన్ అధ్యక్షుడు రోషన్లాల్బోరా, వీరేందర్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కోటగిరి: మండల కేంద్రంలో శనివారం బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి అమిత్షా సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. నాయకులు శ్రీనివాస్, హన్మాండ్లు, సతీష్, మక్కయ్య, మారుతి, శివచరణ్ ఉన్నారు.
బోధన్ రూరల్: బోధన్ అంబేద్కర్ చౌరస్తా నుంచి శనివారం బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి అమిత్షా సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్షా హాజరవుతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాల్రాజ్ తెలిపారు. ఈ సభకు బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లామన్నారు. నాయకులు అడ్లూరి శ్రీనివాస్, మోస్రా పోశెట్టి, రామరాజు, సుధాకర్చారి ఉన్నారు.
ఆర్మూర్రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వేల్పూర్ మండలానికి చెందిన బీజేపీ, కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. ఈ సమావేశా నికి అమిత్షా ముఖ్య అతిథిగా రానున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రాగి ప్రభాకర్, సంపత్కుమార్, సాగర్, మహేష్, కార్యకర్తలు తరలివెళ్ళారు.
మోర్తాడ్: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. మోర్తాడ్ మండల కార్యకర్తల వాహనానికి బీజేపీ బాల్కొండ అసెంబ్లీ ఇన్చార్జి రుయ్యాడి రాజేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు.
డిచ్పల్లి: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా బహిరంగ సభకు డిచ్పల్లి మండలం నుంచి బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఎంపీపీ గద్దె భూమన్న, శ్యాంరావు, సర్పంచ్ రూప సతీష్, ఎంపీటీసీ సంతోషం, తదితరులు ఉన్నారు.
ఎడపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా సభకు బాన్సువాడ నియోజకవర్గం మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు.
Updated Date - 2022-05-15T06:54:34+05:30 IST