ఎంపీ Arvindపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు
ABN, First Publish Date - 2022-01-05T17:29:27+05:30
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈనెల 3న ఎంపీ తన నివాసంలో పోలీసులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన ఎంపీ అరవింద్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ఫిర్యాద చేశారు. ఈ మేరకు ఎంపీపై ఐపీసీ 294, 504, 5051(1),(b) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకీ అరవింద్ ఏమన్నారంటే...."ఐపీఎస్ అధికారులు ఏం పీకుతున్నారు... మీ పోలీసుల లాఠీలు ఏం పీకుతున్నాయి... మీ లాఠీలు పనిచేయడం లేదా... మీ లాఠీలు లంచాలు తీసుకుంటున్నాయా కేటీఆర్.. కేసీఆర్ దగ్గర.. మీరు మీ డిపార్ట్మెంట్ చెంచా గిరి చేస్తున్నారు.." అంటూ ఎంపీ అరవింద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-01-05T17:29:27+05:30 IST