ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NITI Aayog: నీతిఆయోగ్‌ భేటీని కేసీఆర్‌ ఎందుకు బహిష్కరిస్తున్నారు?: రేవంత్

ABN, First Publish Date - 2022-08-06T23:58:51+05:30

నీతి ఆయోగ్‌ (NITI Aayog) భేటీని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎందుకు బహిష్కరిస్తున్నారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నీతి ఆయోగ్‌ (NITI Aayog) భేటీని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎందుకు బహిష్కరిస్తున్నారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీని ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశం ఉండేది కదా అని నిలదీశారు. ప్రధాని మోదీతో కేసీఆర్‌కు చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. జీఎస్టీ (GST) బిల్లు తెచ్చినప్పుడు మోదీని కేసీఆర్‌ పొగిడారని ప్రశ్నించారు. ఏడున్నరేళ్లుగా మోదీతో కేసీఆర్‌ కలిసి నడిచారని విమర్శించారు. కేసీఆర్‌ మాటలు మోదీకి వ్యతిరేకంగా ఉన్నా.. ఆయన చేతలు మాత్రం మోదీకి అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. మోదీకి కేసీఆర్‌ ఏకలవ్య శిష్యుడని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. 


ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ (Prime Minister Modi)కి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్‌ కాకతీయ (Mission Kakatiya)కు రూ.5 వేల కోట్ల గ్రాంట్‌, మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని తెలిపారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

Updated Date - 2022-08-06T23:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising