ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Basar IIITలో మళ్లీ 18 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-08-05T00:29:07+05:30

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో లో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు అయినట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో (Basara IIIT College) 18 మంది విద్యార్థులు (Students అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు అయినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు ట్రిపుట్ ఐటీ క్యాంపస్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కొట్టి పారేశారు. 


అటు వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికాలేదని తెలిపారు. సీజనల్ వ్యాధులతోనే విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని...ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు.


ఇటీవల కూడా బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో యూనివర్సిటీలో ఆందోళనలు చెలరేగాయి. తరచూ ఫుడ్ పాయిజన్ అవుతోందని.. హాస్టల్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనిర్సిటీకి పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి వీసీ చర్చలతో ఈ ఆందోళనను  విద్యార్థులు విరమించారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. 

Updated Date - 2022-08-05T00:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising