ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతల రోడ్లపై వరినాట్లు

ABN, First Publish Date - 2022-08-05T06:05:47+05:30

గుంతల రోడ్లపై వరినాట్లు

రోడ్లపై వరినాట్లు వేస్తూ నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధార్థనగర్‌లో కాంగ్రెస్‌  నేతల నిరసన

కాజీపేట టౌన్‌, ఆగస్టు 4 : కాజీపేట సిద్ధార్థనగర్‌లో బ్రిడ్జికి ఆనుకుని ఉన్న రోడ్లపై ఏర్పడిన గుంతల్లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి తక్కళ్లపల్లి సాగరికరావు మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ రంగల్‌ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడం లో మహానగర పాలక సంస్థ విఫలమైందన్నారు. ప్రఽధానంగా రోడ్లన్నీ దెబ్బతిన్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. కాజీపేట దర్గాకు రాకపోకలు సాగించే రోడ్డంతా దెబ్బతిని నెలలు గడుస్తున్నా పాలకులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రధానంగా ఆ దారిలో ఉన్న పలు పాఠశాల ల్లో చదువుతున్న విద్యార్థులు ఈ నరకరహదారిపై ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేసి ఇబ్బందులను తొలగించాలని కోరారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి, నాయకులు రమేష్‌, లింగమూర్తి, కిరణ్‌, రాజే్‌షఖన్నా, రాజునాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T06:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising