TS News: చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నందమూరి రామకృష్ణ
ABN, First Publish Date - 2022-09-24T00:13:11+05:30
Hyderabad: టీడీపీ(TDP) సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ(Chennupati Gandhi)ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఇటీవల విజయవాడలో వైసీపీ (YCP) నాయకుల దాడిలో కంటికి తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్లో చికిత్సపొందిన విషయం తెలిసిందే. దాడి, పోలీసులు వ్యవహరించిన తీరు, కేసు వివరాల గురించి నందమూరి రామకృష్ణ చెన్నుపాటి గాంధీని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి చెన్నుపాటి
Hyderabad: టీడీపీ(TDP) సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ(Chennupati Gandhi)ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఇటీవల విజయవాడలో వైసీపీ (YCP) నాయకుల దాడిలో కంటికి తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్లో చికిత్సపొందిన విషయం తెలిసిందే. దాడి, పోలీసులు వ్యవహరించిన తీరు, కేసు వివరాల గురించి నందమూరి రామకృష్ణ చెన్నుపాటి గాంధీని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి చెన్నుపాటి గాంధీ నిబద్ధతతో పనిచేస్తున్నారని, జరిగిన ఘటన దురదృష్టకరమని రామకృష్ణ పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజా సంక్షేమానికి పాటుపడాలే తప్ప, దాడులు దౌర్జన్యం చేయటం మంచిదికాదని హితవు పలికారు. రామకృష్ణ వెంట రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యుడు వీరంకి వెంకట గురుమూర్తి ఉన్నారు.
Updated Date - 2022-09-24T00:13:11+05:30 IST