నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్-బలయ్.. హాజరుకానున్న చిరు..
ABN, First Publish Date - 2022-10-06T14:46:35+05:30
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exbition Grounds) నేడు 11గంటలకు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.
Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exbition Grounds) నేడు 11గంటలకు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సహా.. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటలు రుచి చూపించనున్నారు. బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. 2005లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ మెదలుపెట్టారు.
Updated Date - 2022-10-06T14:46:35+05:30 IST