ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సిందే : నామా
ABN, First Publish Date - 2022-05-28T17:27:59+05:30
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, స్వర్గీయ ఎన్టీఆర్లకు భారతరత్న కోసం పార్లమెంట్ సమావేశాల్లో..
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, స్వర్గీయ ఎన్టీఆర్లకు భారతరత్న కోసం పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని తెలిపారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కొనియాడారు.
Updated Date - 2022-05-28T17:27:59+05:30 IST