Yadadri: బాలాలయంలో నిత్యకళ్యాణం, సుదర్శన హోమం నిలిపివేత
ABN, First Publish Date - 2022-03-17T13:51:57+05:30
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో నేటి నుండి నిత్య కళ్యాణం, సుదర్శన హోమం, స్వామి వారి జోడు సేవలు నిలిపివేయనున్నట్లు ఈవో గీత తెలిపారు.
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో నేటి నుండి నిత్య కళ్యాణం, సుదర్శన హోమం, స్వామి వారి జోడు సేవలు నిలిపివేయనున్నట్లు ఈవో గీత తెలిపారు. ఈ నెల 21 నుండి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక యాగం నిర్వహణ కారణంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఆర్జిత సేవలు పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయంలో భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో గీత పేర్కొన్నారు.
Updated Date - 2022-03-17T13:51:57+05:30 IST