విద్యార్థులకు తోడ్పాటునందిస్తాం
ABN, First Publish Date - 2022-09-24T06:15:53+05:30
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాగర్ సిమెంట్ పరిశ్రమ నుంచి తోడ్పాటు అందిస్తామని పరిశ్రమ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణమూర్తి అన్నారు.
మఠంపల్లి, సెప్టెంబరు 23: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాగర్ సిమెంట్ పరిశ్రమ నుంచి తోడ్పాటు అందిస్తామని పరిశ్రమ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణమూర్తి అన్నారు. మండలంలోని 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన 30మంది విద్యార్థులకు పరిశ్రమ వ్యవస్థాపకుడు సమ్మిడి వీరారెడ్డి స్మారకార్థం రూ.4.50లక్షల మెరిట్ స్కాలర్షి్పలను పరిశ్రమ ఆడిటోరియంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో పానుగోతు ఛత్రునాయక్, పరిశ్రమ ప్రతినిధులు డీజీఎం హెచ్ఆర్ హరిదాసు, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-09-24T06:15:53+05:30 IST