భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో వజ్రోత్సవాలు
ABN, First Publish Date - 2022-08-11T05:44:39+05:30
భారత స్వాతంత్రోద్యమం స్ఫూర్తితో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి కోరారు.
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 10: భారత స్వాతంత్రోద్యమం స్ఫూర్తితో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి కోరారు. బుధవారం మండల పరిధిలోని జలాల్పూర్లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ పార్కును ప్రారంభించిన అనంతరం జాతీయ పతాకాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట పుష్పలత, సర్పంచ్ పర్నె రజిత, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, ఎంపీడీవో ఎ బాలశంకర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ సామ రవీందర్రెడ్డి, గోరంటి శ్రీనివా్సరెడ్డి, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-11T05:44:39+05:30 IST