మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
ABN, First Publish Date - 2022-08-18T05:46:51+05:30
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయ మని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అ న్నారు.
దేవరకొం డ, ఆగస్టు 17: మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయ మని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అ న్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన మునుగోడులో జరిగే ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని అన్నారు. దొంగలకు, ద్రోహులకు గుత్తేదారులకు మునుగోడు ప్రజల చైతన్యాన్ని మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు. మునుగోడు అభివృద్ధి కేవలం టీఆర్ఎ్సతోనే సాధ్యమని ఇక్కడి ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు. మునుగోడు సభతోనే ఇ క్కడ ప్రజల అభిప్రాయం స్పష్టం కానుందన్నారు. సమావేశంలో మునిసిపల్ చై ర్మన అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జానయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు టీవీఎనరెడ్డి, రమావత దస్రు, చంద్రశేఖర్రెడ్డి, నాయకులు వెంకటే్షగౌడ్, యుగేందర్రెడ్డి, లింగారెడ్డి, విద్యాసాగర్రావు, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-08-18T05:46:51+05:30 IST