ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగిల్‌యూస్‌ ప్లాస్టిక్‌ వస్తువులు వినియోగించిన 18మందికి వ్యాపారులకు జరిమానా

ABN, First Publish Date - 2022-09-13T05:51:11+05:30

నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగిస్తున్న భువనగిరిలోని దుకాణాలపై మునిసిపల్‌ అధికారులు కొరడా ఝుళిపించారు.

దుకాణ యజమానికి వస్త్ర సంచులను అందిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన, సెప్టెంబరు 12: నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగిస్తున్న భువనగిరిలోని దుకాణాలపై మునిసిపల్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. కమిషనర్‌ బి.నాగిరెడ్డి నేతృత్వంలోని మునిసిపల్‌ బృందం సోమవారం ఏకంగా 45 దుకాణాల్లో తనిఖీలు చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగింస్తున్న 18 మంది యజమానులను గుర్తించి రూ.13,800 జరిమానా విధించారు. అదే సమయంలో మునిసిపల్‌ మెప్మా ఆఽధ్వర్యంలోని మహిళా సంఘాలు కుట్టిన వెయ్యి వస్త్ర బ్యాగులను ఒక్కటి రూ.10 చొప్పున సంబంధిత యజమానులతో కొనుగోలు చేయించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం వస్త్ర సంచులనే వాడాలని, ముందస్తు ఆర్డర్‌తో మహిళా సంఘాల నుంచి సంచులను కొనుగోలు చేయవచ్చునని కమిషనర్‌ సూచించారు.  


Updated Date - 2022-09-13T05:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising