ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిది

ABN, First Publish Date - 2022-08-10T06:32:44+05:30

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. మంగళవారం రాజాపేట మండలం రేణికుంటలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపుడి జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురిని ఘనంగా సన్మానించారు.

రాజాపేట మండలం రేణికుంటలో స్వాతంత్ర సమరయోధుడు జనార్ధన్‌రెడ్డిని సన్మానిస్తున్న విప్‌ సునీత, కలెక్టర్‌ పమేలాసత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌ సునీత, కలెక్టర్‌ పమేలాసత్పథి

రాజాపేట, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం మరువలేనిదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. మంగళవారం రాజాపేట మండలం రేణికుంటలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపుడి జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుకు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశస్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు, చేసిన పోరాటం వెలకట్టలేనివన్నారు. ముందుగా సీహెచ్‌ రాంరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాంరెడ్డి రైతాంగానికి అండగా నిలిచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, సర్పంచ్‌ భాగ్యమ్మ, ఎంపీపీ బాలమణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, నాయకులు వెంకటరాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌, బాలనర్సయ్య, భాస్కర్‌, తిరుపతిరెడ్డి, నర్సింహులు, రాఘవరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising