ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-07-04T07:20:00+05:30
ఆర్యవైశ్యుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు అన్నారు.
సూర్యాపేట కల్చరల్, జూలై 3: ఆర్యవైశ్యుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అలయంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ సభ్యులకు ఆయన నియామకపత్రాలు అందజేసి ఆయన మాట్లాడారు. సూర్యా పేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. అందరూ ఐక్యతతో ఉండి ఆర్య వైశ్యుల సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బండారు రాజా, తాటికొండ సీతయ్య, మీలా వంశీ, సోమనర్సయ్య, వెంపటి సురేష్, శ్రీనివాస్, రమేష్బాబు, రవీందర్, రాధాకృష్ణ, చంద్రశేఖర్, విద్యాసాగర్రావు, దయాకర్, సత్యనారాయణ, లక్ష్మయ్య, విజయ్కుమార్, కిరణ్, వెంకన్నపాల్గొన్నారు.
Updated Date - 2022-07-04T07:20:00+05:30 IST