నియంత పాలనకు గుణపాఠం ఖాయం
ABN, First Publish Date - 2022-02-19T06:12:34+05:30
రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తు న్న సీఎం కేసీఆర్కు రా బోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కిసాన మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురే్షరెడ్డి అన్నారు.
కిసానమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురే్షరెడ్డి
చింతపల్లి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తు న్న సీఎం కేసీఆర్కు రా బోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కిసాన మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురే్షరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోలేపల్లి రాంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు పేదలు, రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్యల ను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ఉత్తరప్రదేశ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై దృష్టి సారించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమన్నా రు. సమావేశంలో నాయకులు గోలి మధుసూదనరెడ్డి, లాలునాయక్, రాములు, రమే్షయాదవ్, బాల్జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-02-19T06:12:34+05:30 IST