ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-06-30T06:33:09+05:30

ఎన్నికలకు ముందు, తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

ధర్నాలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

మోత్కూరు, జూన 29: ఎన్నికలకు ముందు, తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మోత్కూరు మండల, పట్టణ పేద ప్రజలు వినతి పత్రాలు చేతబట్టుకుని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 57 ఏళ్లకు ఆసరా పింఛన, స్వంత స్థలాలు ఉన్నవారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షల ఆర్థికసాయం, నూతన రేషన కార్డులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పీఎం ఆవాజ్‌ యోజన పథకం కింద ప్రధాని మోదీ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రకటించారని, ఇక్కడ ఒక్కరికి కూడా అందలేదన్నారు.   ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్‌ షేక్‌ అహమ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రజలు ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, నాయకులు గుండు వెంకటనర్సు, కూరపాటి రాములు, రాచకొండ రాములమ్మ, కూరెళ్ల రాములు, కుందుకూరి నర్సింహ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising