ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బంధు రూ.508కోట్లు

ABN, First Publish Date - 2022-01-15T06:39:22+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంలో భా గంగా ఇప్పటి వరకు రూ.508.89కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఎనిమిదో దశగా 2021, డిసెంబరు 28వ తేదీ నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో నగదును జమచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

4,53,399 మంది రైతుల ఖాతాల్లో జమ

పెట్టుబడి సాయం కోసం పలువురు రైతుల ఎదురుచూపులు


నల్లగొండ, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంలో భా గంగా ఇప్పటి వరకు రూ.508.89కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఎనిమిదో దశగా 2021, డిసెంబరు 28వ తేదీ నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో నగదును జమచేస్తోంది. ఇప్పటి వరకు 7.20ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే నగదు జమచేసింది. సంక్రాంతి పండుగ వరకు పూర్తిస్థాయిలో రైతుబంధు సొమ్ము వస్తుందని రైతులు ఆశించినా అమలుకాలేదు.


రూ.508కోట్లు జమ

జిల్లాలో రైతుబంధుకు అర్హులైన 4,93,146 మంది రైతులను గుర్తించి విరాలను రాష్ట్ర వ్యవసాయశాఖకు జిల్లా అధికారులు పంపిచారు. వీరికి సంబంధించి రూ.616,21,46,323 రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాగా, రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు ఇప్పటి వరకు 4,69,733 మందివి అప్‌డేట్‌ అయ్యాయి. ఇందులో 4,68,696 మంది వివరాల వెరిఫికేషన్‌ పూర్తయింది. మొత్తంగా 4,66,772 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ట్రెజరీకి వివరాలు పంపింది. అందుకు రూ.571,78,32,840 జమ చేయాల్సి ఉంది. కాగా, శుక్రవారం సాయంత్రానికి 4,53,399 మంది రైతుల ఖాతాల్లో రూ.508,89,97,404 జమయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇంకా 13,373 మంది రైతులకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. అయితే రైతులకు ఎంత భూమి ఉంటే అంతే వేస్తారా లేక కోత పెడతారా, భూమి ఎక్కువ ఉన్న రైతులకు పథకాన్ని వర్తింపజేస్తారా లేక నిలిపివేస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటి వరకు 7.20ఎకరాల భూమి ఉన్న రైతుల వరకే రైతుబంధు అందింది. దీంతోనే ప్రభుత్వ సాయం నిలుస్తుందనే అనుమానాలు 10 నుంచి 20 ఎకరాల లోపు ఉన్న రైతుల్లో ఉంది. 


వెబ్‌సైట్‌లో తప్పుల తడకగా వివరాలు

ఇదిలా ఉండగా, ఈనెల 13వ తేదీ వరకు 4,53,421 మంది రైతుల కు రూ.508,93,60,000 జమ అయినట్టు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైంది. కాగా, 14వ తేదీ సాయంత్రం వరకు 4,53,399 మంది రైతులకు రూ.508,89,97,000జమ అయినట్లు గా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే ఒకరోజుకు ముందుగా రైతుల సంఖ్య, జమ అయిన డబ్బు మొత్తాన్ని అధికంగా చూపి, ఆ తరువాత రోజు సంఖ్యను తగ్గించారు. దీంతో ఇవి అసలు లెక్కలా, కాకి లెక్కలా, నిజంగానే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందో లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్‌సైట్‌లో తప్పుల తడకగా లెక్కలు చూపిస్తున్న యంత్రాం గం, వాస్తవ పరిస్థితులను చూపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రెజరీ నుంచి డబ్బులు జమ సమయంలో ఖాతా నెంబర్లు సక్రమంగా లేకపోవడంతో కొందరివి వెనక్కి వచ్చాయని, దీంతోనే సంఖ్య తక్కువగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-01-15T06:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising