వీఆర్ఏలకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN, First Publish Date - 2022-05-22T05:22:16+05:30
వీఆర్ఏలకు సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.
తిరుమలగిరి / చింతలపాలెం / మద్దిరాల, మే 21 : వీఆర్ఏలకు సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. వీఆర్ఏల చలో సీసీఎల్ఏ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు శనివారం వీఆర్ఏలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020లో పేస్కేల్ అమలు చేస్తామని, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. తిరుమలగిరిలో మండలంలో వీఆర్ ఏలు పల్లెర్ల వెంకన్న, నాగన్న, ఆగేష్, సత్తయ్య, చింతలపాలెంలో కౌసల్య, పుల్లమ్మ, సలోమీ, పుష్పలత, కొండలు, గోపీ, నరసింహారావు, కాశయ్య, వెంకటేశ్వర్లు, ఏలియా, నాగరాజు, మద్దిరాలలో వీఆర్ఏ పాల్వాయి వెంకన్న, రమేష్, ప్రశాంత్, వెంకటేశ్వర్లు, వెంకటమల్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు.
Updated Date - 2022-05-22T05:22:16+05:30 IST