సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2022-04-20T14:11:05+05:30
జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం వద్ద రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి.
సూర్యాపేట: జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం వద్ద రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్యాబిన్లో ఇరుక్కొని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-04-20T14:11:05+05:30 IST