మద్యం సేవించి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్..
ABN, First Publish Date - 2022-04-08T17:52:51+05:30
సూర్యాపేట జిల్లా: పట్టపగలే మద్యం సేవించి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపాడు.
సూర్యాపేట జిల్లా: పట్టపగలే మద్యం సేవించి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపాడు. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్, దిల్షుఖ్నగర్ నుంచి తొర్రూరుకు 30 మంది ప్రయాణీకులతో బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో మోత్కూరు బస్సు స్టేషన్లో బస్సును ఆపిన డ్రైవర్ ఆ పక్కనే ఉన్న బెల్ట్ షాపులో మద్యం సేవించాడు. ఆ తర్వాత బస్సు తిరుమలగిరి వైపు బయలుదేరింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు తిరుమలగిరి చెక్ పోస్టు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవర్ బ్రీత్ ఎన్లైజర్ పరీక్షకు నిరాకరించాడు. తనపై కేసు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ దబాయించాడు. కొద్ది సేపు హై డ్రామ తర్వాత బ్రీత్ ఎన్లైజర్ పరీక్ష చేశారు. మద్యం సేవించినట్లు తేలడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2022-04-08T17:52:51+05:30 IST