అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ABN, First Publish Date - 2022-01-21T06:52:58+05:30
నల్లమల్ల అటవీ సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీ సుకుంటున్నట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్ట ర్ (ఐఎ్ఫఎస్) బి. శ్రీనివాస్ అన్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్
దేవరకొండ, జనవరి 20: నల్లమల్ల అటవీ సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీ సుకుంటున్నట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్ట ర్ (ఐఎ్ఫఎస్) బి. శ్రీనివాస్ అన్నారు. గురువారం చం దంపేట మండలం కంబాలపల్లి రేంజ్ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతా న్ని జిల్లా అటవీశాఖ అధికారి రాంబాబు, నాగార్జునసాగర్ డివిజన అటవీశాఖ అధికారి సర్వేశ్వర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబాలపల్లి, దేవరకొండ రేంజ్లో నల్లమల్ల 41,590 హెక్టార్లలో విస్తరించి ఉందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో వేసవిలో వ న్యప్రాణులకు తాగునీరు అందించేందుకు రూ.9 లక్షలతో నిర్మించిన చెక్డ్యాంలను ఆయన పరిశీలించారు. నల్లమల్లలో 300 ఎకరాల్లో వివిధ రకాల మొక్కలు నాటినట్లు తెలిపారు. నల్లమల్లలో చిరుతపులులతో పాటు వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అటవీ భూములను ఆక్ర మిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెం ట అటవీశాఖ అధికారులు మోహన, చంద్రకళ, శ్రీదేవి ఉన్నారు.
Updated Date - 2022-01-21T06:52:58+05:30 IST