స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలి
ABN, First Publish Date - 2022-08-10T06:12:54+05:30
తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు.
సూర్యాపేటటౌన్, ఆగస్టు 9: తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమ కరపత్రాలను జిల్లాకేంద్రంలో మంగ ళవారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పదవులను కట్టబెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ అనంతుల మధు, నాయకులు కుంట్ల ధర్మార్జున్, మండారి డేవిడ్కుమార్, రాపర్తి శ్రీనివాస్గౌడ్, గండూరి రమేష్, పంతం యాకయ్య, గట్ల రమాశంకర్, మాండ్ర మల్లయ్యయాదవ్ ఉన్నారు.
Updated Date - 2022-08-10T06:12:54+05:30 IST