ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగబోతోంది..

ABN, First Publish Date - 2022-08-12T22:17:40+05:30

మూడున్నరేళ్లుగా మునుగోడు నియోజకవర్గం సమస్యలపై పోరాడుతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ (Nalgonda): మూడున్నరేళ్లుగా మునుగోడు నియోజకవర్గం సమస్యలపై పోరాడుతున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగబోతోందన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే వ్యాపారవేత్తనని, వ్యాపారం కోసం రాజకీయాలు చేసేగుణం తనది కాదని అన్నారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ (CM KCR) హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడును పట్టించుకోనివారు.. రేపటి నుంచి డబ్బు సంచులతో తిరుగుతారని అన్నారు.


మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని, తనను గుండెల్లో పెట్టుకుంటారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, మునుగోడు ప్రజలకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉప ఎన్నికని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-08-12T22:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising