ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజగోపాల్‌ అవసరం కోసమే ఉప ఎన్నిక

ABN, First Publish Date - 2022-08-19T06:20:53+05:30

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవసరాలకే ఉపఎన్నిక వ చ్చిందని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాజగోపాల్‌ అవసరం కోసమే ఉప ఎన్నిక 

శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి 

నల్లగొండ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవసరాలకే ఉపఎన్నిక వ చ్చిందని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. గత మూడున్నరేళ్ల కాలంలో ఇది మూడవ ఉప ఎన్నిక హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఎంపీగా వెళ్లడంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో సాగర్‌లో ఉప ఎన్నిక వచ్చింది. మునుగోడులో ఉపఎన్నిక రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత కాంట్రాక్టుల కో సం వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాలో గ్రామగ్రామాన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. మూడు మెడికల్‌ కళాశాలలు, 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత కేంద్రం, ఏ మునిసిపాలిటీలో చూసినా అభివృద్ధి, పచ్చదనం కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష. ఈ నెల 20వ తేదీన మునుగోడులో జరగనున్న ప్రజాదీవెన బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా జిల్లా ప్రజలను కోరా రు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు హక్కులను కోల్పోతామని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి అహంకారం వల్లే మునుగోడులో ఉపఎన్నిక వచ్చింది. బీజేపీ చేతిలో పావుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మారాడని ఆయన దు య్యబట్టారు. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని తెలంగాణ ప్రజ లు తెలివితో తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. 



Updated Date - 2022-08-19T06:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising