కేసీఆర్ పాలనను చీదరించుకుంటున్న ప్రజలు
ABN, First Publish Date - 2022-08-20T06:24:12+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను ప్రజలందరూ చీదరించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్సగౌడ్ ఆ రోపించారు.
రామగిరి, ఆగస్టు 19: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను ప్రజలందరూ చీదరించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్సగౌడ్ ఆ రోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో గెలవాలనే ఉద్దేశంతోనే ప్ర జలకు తాయిలాలు ప్రకటించడం ఎన్నికల స్టంట్ మాత్రమేనని అన్నారు. కేసీఆర్ ఎ న్ని హామీలు ఇచ్చినా, నిధులు ఎన్ని విడుదల చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్ను న మ్మరని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆ యన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, మొరిశెట్టి నాగేశ్వర్రావు, బండారు ప్రసాద్, చర్లపల్లి గణేష్, రవి, రాఖీ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-20T06:24:12+05:30 IST