‘పల్లె ప్రగతి’ని విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-05-29T06:07:34+05:30
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు.
జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
బీబీనగర్, మే 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుధాకర్గౌడ్ అధ్యక్షతన సర్పంచ్లు, ఎంపీటీసీలకు ‘పల్లె ప్రగతి’ నిర్వహణపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో శనివారం పాల్గొని మాట్లాడా రు. జూన్ 3వతేదీ నుంచి 18వరకు నిర్వహించతలపెట్టిన 5వవిడత పల్లె ప్రగ తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గణే్షరెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ప్రత్యేక అధికారి అన్నపూర్ణపాల్గొన్నారు.
Updated Date - 2022-05-29T06:07:34+05:30 IST