అమరుల ఆశయసాధనకు పాటుపడాలి: చెరుపల్లి
ABN, First Publish Date - 2022-06-29T06:32:38+05:30
అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు.
చౌటుప్పల్, జూన 28: అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు. మండల కేంద్రంలో అమరజీవి రొడ్డ అంజయ్య సంతాప సభ మంగళవారం జరిగింది. ఈసందర్భంగా సీతారాములు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అంజయ్య రాజీలేని పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శి ఎండి.జహంగీర్, వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, ఎండి.పాష, బూర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, బండారు నర్సింహ, బత్తుల శ్రీశైలం, గోపగోని లక్ష్మణ్, తడక మోహన, గోశిక కరుణాకర్, దాసు, బాలయ్య, కిష్టయ్య, బుచ్చిరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-06-29T06:32:38+05:30 IST