ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరికాయల సంచుల్లో గంజాయి తరలింపు

ABN, First Publish Date - 2022-10-04T05:46:24+05:30

కొబ్బరికాయ సంచుల మధ్యన భారీగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని ఎస్‌వోటీ, సివిల్‌ పోలీసులు పట్టుకున్నారు.

పట్టుబడిన గంజాయిని తూకం వేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.2కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఘటన

ఆలేరు, అక్టోబరు 3: కొబ్బరికాయ సంచుల మధ్యన భారీగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని ఎస్‌వోటీ, సివిల్‌ పోలీసులు పట్టుకున్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని 163వ జాతీయ రహదారిపై సోమవారం ఈ సంఘటన జరిగింది. ఆలేరు ఎస్‌ఐ ఇద్రిస్‌అలీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్ర మంగా తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆలే రులో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. మహా రాష్ట్రకు చెందిన ఎంహెచ్‌ 14 సీపీ 8698 నెంబరు గల డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా, కొబ్బరి కాయల బస్తాల మధ్యలో భారీ ఎత్తున 900కిలోల గంజాయిని గుర్తించారు. డ్రైవర్‌ను, అందులో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల్లో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వారు ఉండగా, ఒకరు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-10-04T05:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising