ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyavati rathod: స్వంత ప్రయోజనం కోసమే రాజగోపాల్ రాజీనామా

ABN, First Publish Date - 2022-10-11T18:46:57+05:30

మునుగోడులో తన స్వంత ప్రయోజనం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: మునుగోడులో తన స్వంత ప్రయోజనం కోసమే రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) రాజీనామా చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati rathod) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏంచేయని రాజగోపాల్ (BJP Leader) ఇవాళ ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆయనను ఓడగేట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి తిరస్కరిస్తారన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ (CM KCR) రాజకీయ అనుభవం అంత లేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.


టీఆర్ఎస్ (TRS) తిరుగులేని శక్తిగా మునుగోడులో నిల్వబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మూడు ఉప ఎన్నికలు వచ్చాయని,  అందులో ఇప్పటికే రెండు భారీ మెజారిటీతో గెలిచామని అన్నారు. రాజగోపాల్ కాంట్రాక్టుల కోసమే ఆయన బీజేపీలోకి వెళ్లారన్నారు. పోరాటాల్లో ముందున్న కమ్యూనిస్టు పార్టీల నేతలు తమకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మేనమామ లాగా ఆడపిల్లకు అండగా ఉండి కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు పెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ (Telangana minister) అన్నారు. 

Updated Date - 2022-10-11T18:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising