నేతన్న కోసం పలు పథకాలు
ABN, First Publish Date - 2022-08-08T05:56:49+05:30
చేనేతకు సా యం అందించేందుకు ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని డీసీవో గోలి శ్రీను అన్నారు.
డీసీవో గోలి శ్రీను
జౌళిశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
నల్లగొండ టౌన్, ఆగస్టు 7: చేనేతకు సా యం అందించేందుకు ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని డీసీవో గోలి శ్రీను అన్నారు. చేనేత చేనేత దినోత్సవం సందర్భంగా జౌళిశాఖ ఆధ్వర్యంలో రామగిరిలోని గాంధీ విగ్రహం నుంచి నిర్వహించిన ర్యాలీని చేనేతశాఖ అధికారి సోమిడి ద్వారక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గడియారం సెంటర్ మీదుగా టౌన్హాల్ వరకు సాగింది. అనంతరం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన సమావేశంలో డీసీవో గోలి శ్రీను మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా సన్మానించి చేనేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి సల్మాభాను, అసిస్టెంట్ ఏడీ రంజిత్, చేనేత సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టబత్తిని సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి కర్నాటి యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, గంజి మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-08T05:56:49+05:30 IST