ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేగేట్‌కు భూ సేకరణ

ABN, First Publish Date - 2022-05-26T06:21:18+05:30

భువనగిరి అర్బన్‌ కాలనీ వాసులకు రైల్వే గేటు కష్టాలు తీరనున్నాయి. రైల్వే గేటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాం త వాసులు చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. అర్బన్‌ కాలనీ నుంచి హుస్సేనాబాద్‌ మీదుగా కిసాన్‌నగర్‌, అండర్‌ పాస్‌ రైల్వే బ్రిడ్జి వరకు 30ఫీట్ల వెడల్పుతో రోడ్డు ను నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ చేయాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

తీరనున్న అర్బన్‌ కాలనీ వాసుల ఇక్కట్లు

భువనగిరి టౌన్‌, మే 25: భువనగిరి అర్బన్‌ కాలనీ వాసులకు రైల్వే గేటు కష్టాలు తీరనున్నాయి. రైల్వే గేటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాం త వాసులు చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. అర్బన్‌ కాలనీ నుంచి హుస్సేనాబాద్‌ మీదుగా కిసాన్‌నగర్‌, అండర్‌ పాస్‌ రైల్వే బ్రిడ్జి వరకు 30ఫీట్ల వెడల్పుతో రోడ్డు ను నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ చేయాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ  చేశారు. అయితే భూసేకరణకు రెండు నెలల క్రితమే భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. కాగా, మూడేళ్ల క్రితం కూడా భూసేకరణకు చేసిన ప్రయత్నాలకు భూయజమానులు అభ్యంతరం తెలపడంతో నాడు పనులు నిలిచిపోయాయి. తిరిగి భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ఈ ప్రక్రియ ఈ సారైనా పూర్తయి రోడ్డు కష్టాలు తీరుతాయని అర్బన్‌ కాలనీ, శ్రీరాంనగర్‌, అంబేద్కర్‌నగర్‌, తదితర బస్తీ వాసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-26T06:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising