Kavitha comments: మునుగోడు ఉపఎన్నికపై కవిత ఏమన్నారంటే...
ABN, First Publish Date - 2022-08-10T19:51:45+05:30
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ (Hyderabad): మునుగోడులో ప్రస్తుతం రాజకీయలు నడుస్తున్నాయని, ఇక్కడ టీఆర్ఎస్ (TRS) గెలుపు ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటని అన్నారు. హుజుర్నగర్, నాగార్జునసాగర్ లాగానే మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షమ పథకాలు ఆపలేదన్నారు. పెన్షన్లు లాంటివి అన్ని పథకాలు ప్రజలకి అందించామన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడపటం.. ప్రజల మన్ననలు పొందడంలో కూడా సీఎం కేసీఆర్ (CM KCR) ముందు ఉంటారని అన్నారు. బీహార్లో బీజేపీ ఏక పక్ష నిర్ణయాలు మంచిది కాదని, బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎన్నడూ నడవవని కవిత వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-08-10T19:51:45+05:30 IST