ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి

ABN, First Publish Date - 2022-05-28T06:26:54+05:30

పెంచిన ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ కోరారు. ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిప్రతం అంజేశారు

చౌటుప్పల్‌లో ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన

అధికారులకు వినతిపత్రాల అందజేత

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, మే 27: పెంచిన ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ కోరారు. ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిప్రతం అంజేశారు.  చౌటుప్పల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని, ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలనీ ఆయన డిమాండ్‌ చేశారు. పెంచిన వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని,  ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేపి 14 రకాల నిత్యావసర వస్తువులను అందించా లని ఆయన కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.7500లు ఇవ్వాలని. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవో సూరజ్‌ కుమార్‌కు  అందజేశారు.  కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదిర్శ పల్లె శేఖర్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్‌ రెడ్డి, సీపీఎం నాయకులు ఎండీ పాష, బూరుగు కృష్ణారెడ్డి పాల్గొన్నారు



Updated Date - 2022-05-28T06:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising