ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-07-07T06:28:20+05:30
పల్లె దవాఖానాలను రోగులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణాధికారి కల్యాణ్ చక్రవర్తి అన్నారు.
కోదాడ రూరల్, జూలై 6: పల్లె దవాఖానాలను రోగులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణాధికారి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. బుధవారం మండలంలోని నల్లబండగూ డెంలో పల్లె దవాఖాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం వైద్యులతో, ఆరోగ్య సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 34 పల్లె దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు . గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అధిక రక్తపోటు, మధుమేహ రోగుల వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని కోరారు. మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖానా వైద్యాధికారి లక్ష్మీప్రసన్న, ఆరోగ్య కార్యకర్త అరుణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-07T06:28:20+05:30 IST